హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ద్విచక్ర వాహనాలకు వేలం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్‌ స్టేషన్‌ ఆవరణలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను సోమవారం వేలం వేయనున్నట్లు ఎక్సైజ్‌ సీఐ రమ్య తెలిపారు. వేలంలో పాల్గొనేవారు సంబంధిత వాహనానికి దారావత్తుగా 50 శాతం నగదు చెల్లించాలి. వేలంలో వాహనం దక్కించుకున్న వారు అదే రోజు మిగతా మొత్తాన్ని చెల్లించాలని అధికారులు సూచించారు.