హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండ్రికి తలకొరివి పెట్టిన 11 ఏళ్ల కూతురు

JN:స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తోట మోహన్‌ (44)గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భార్య లావణ్య మూడేళ్ల క్రితమే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులను కోల్పోయిన 11ఏళ్ల కుమార్తె నిత్యశ్రీ ఆదివారం తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.