హైదరాబాద్: 28°C
వార్తలు

వివేకానంద కేంద్రం అధ్యక్షుడు మృతి

తమిళనాడు కన్యాకుమారిలోని ఆలిండియా వివేకానంద కేంద్రం అధ్యక్షుడు ఎ.బాలకృష్ణన్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన బాలకృష్ణన్ 1981 నుంచి 2001 వరకు ఆలిండియా వివేకానంద కేంద్రం ప్రధాన కార్యదర్శిగా, 2001 నుంచి 2020 వరకు ఉపాధ్యక్షుడిగా, 2020 నుంచి అధ్యక్షుడిగా సేవలందించారు.