హైదరాబాద్: 28°C
వార్తలు

మూడు రోజులు వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే నెల 2 వరకు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దీంతో మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది.