హైదరాబాద్: 28°C
వార్తలు

విమానానికి తప్పిన ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌లో విమానానికి పెను ప్రమాదం తప్పింది. బిలాస్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ సమయంలో విమానం టైరు ఒక్కసారిగా పేలింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఘటనతో ఎయిర్‌పోర్టులో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.