హైదరాబాద్: 28°C
వార్తలు

‘భారత్‌ చేతికి అధునాతన జావెలిన్‌ క్షిపణులు’

అమెరికాతో కుదిరిన కీలక ఒప్పందంలో భాగంగా భారత్ యుద్ధంలో పరీక్షించబడిన జావెలిన్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. భారత్-అమెరికా రక్షణ సంబంధాల్లో ఇది గొప్ప ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 100 జావెలిన్ రౌండ్లు, లాంచ్ యూనిట్లు, శిక్షణ సిమ్యులేటర్లు భారత్‌కు అందనున్నాయని తెలిపారు.