ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపణి వ్యవస్థను అతిపెద్ద ముప్పుగా పాక్ భావించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర వెల్లడించారు. ఎస్-400 క్షిపణి వ్యవస్థలను గుర్తించడానికి ఆ దేశం ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు. ఇందుకోసం భారత్లో ఉన్న పాక్ గూఢచారులు, స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసిందని తెలిపారు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి ఉపగ్రహాల సహాయాన్ని కూడా తీసుకుందని చెప్పారు.
వార్తలు
ఎస్-400ను గుర్తించేందుకు పాక్ విశ్వ ప్రయత్నాలు


