హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్.. రైతుల్లో భయాందోళన

VKB: వికారాబాద్ నుంచి మైలార్‌దేవరంపల్లి వెళ్లే మార్గంలో ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేకపోవడంతో ప్రయాణికులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రహదారి సమీపంలోనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.