హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెల్ ఫోన్ చోరీ.. ఆపై నగదు డ్రా

ATP: ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుడి సెల్‌ఫోన్ చోరీ చేసి, దాని ద్వారా ఏటీఎంలో నగదు డ్రా చేసిన ఘటన అనంతపురంలో జరిగింది. పులివెందులకు చెందిన రాజేష్ కుమార్‌రెడ్డి బస్సు ఎక్కుతుండగా ఆయన రూ. 72 వేల విలువైన సెల్‌ఫోన్‌ను దొంగ ఎత్తుకెళ్లాడు. ఆపై గుత్తి రోడ్డులోని ఏటీఎంలో రూ.15 వేలు డ్రా చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.