హైదరాబాద్: 28°C
వార్తలు

ఒడిశాలో భారీ వర్షాలు.. ప్రజల తీవ్ర ఇబ్బందులు

భారీ వర్షాలు ఒడిశాను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికీ అనేక జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 6 జిల్లాల్లో దాదాపు లక్ష మందిపై వరద ప్రభావం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపడా, నవరంగ్‌పూర్, కోరాపుట్, కేందుఝర్ జిల్లాల్లో వరదలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.