హైదరాబాద్: 28°C
వార్తలు

శబరిమలకు నో పర్మిషన్.. హైకోర్టుకు ట్రాన్స్‌జెండర్

శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్నారంటూ ఓ ట్రాన్స్‌జెండర్ సత్యశ్రీ షర్మిలా కేరళ హైకోర్టు ఆశ్రయించారు. తనను నిరాకరించడంతో తన ఆధ్యాత్మిక యాత్రకు అంతరాయం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, దేవస్థానం బోర్డుకు, పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌కు నోటీసులను కోర్టు పంపించింది.