ELR: ముసునూరులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈనెల 24వ తేదీన పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలీసు సిబ్బందితో ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు చెలరేగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. భద్రత విధులలో 459 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉపరాష్ట్రపతి పర్యటనలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు: SP


