హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్‌పై డీసీపీ వార్నింగ్!

NTR: గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు సమాజంలో చోటు లేదని విజయవాడ రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ ఐపీఎస్ అన్నారు. నందిగామ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన “EAGLE CHALLENGE” కార్యక్రమంలో ఆయన పాల్గొని అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం ఇస్తే రూ.1,500, విక్రయదారులపై సమాచారం ఇస్తే రూ.5,000 నగదు బహుమతి అందిస్తామని తెలిపారు.