హైదరాబాద్: 28°C
వార్తలు

టైలర్‌కు షాక్‌.. ఏకంగా రూ.975 కోట్ల ఐటీ నోటీస్‌

రాజస్థాన్‌కు చెందిన 62 ఏళ్ల టైలర్ రేఖ్‌రాజ్ థాడాకు రూ.975 కోట్ల ఐటీ నోటీసు రావడంతో షాక్‌కు గురయ్యారు. సూరత్‌లోని ఓ నకిలీ డైమండ్ కంపెనీకి ఆయనను డైరెక్టర్‌గా చూపించి రూ.2,500 కోట్ల హవాలా లావాదేవీలు నిర్వహించినట్లు మోసగాళ్లు ఆయన పత్రాలను దుర్వినియోగం చేశారు. సూరత్‌లోని ఆ చిరునామాలో కేవలం మెషీన్ల రిపేర్ వర్క్‌షాప్ మాత్రమే ఉందని వెల్లడైంది.