WGL: కుష్ మహల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద స్వాతంత్య్ర సమరయోధులను శాలువాలతో సన్మానించారు. ఆమె మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. వారి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం


