హైదరాబాద్: 28°C
వార్తలు

విధుల నుంచి ఉపాధ్యాయుడి తొలగింపు

అన్నమయ్య: పీలేరు మండలం కావలిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న నాగార్జున ఎలాంటి అనుమతి లేకుండా 883 రోజులు విధులకు గైర్హాజరయ్యారు. 2023 నవంబర్‌ 21 నుంచి 2026 ఏప్రిల్‌ 21 వరకు విధులకు హాజరుకాకపోవడంతో అధికారులు పలుమార్లు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. విద్యాశాఖ అధికారులు ఆయనను విధుల నుంచి తొలగించినట్లు ఎంఈవో పద్మావతి తెలిపారు.