హైదరాబాద్: 28°C
వార్తలు

తనపై జరిగిన దాడిపై సుఖ్‌బీర్ స్పందన

మహారాష్ట్ర నాందేడ్‌లో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుఖ్‌బీర్ స్పందించారు. తనపై దాడి చేయటం వల్ల తానేమి భయపడనని వెల్లడించారు. దేశంలో అశాంతి నెలకొల్పాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. శిరోమణి అకాలీదళ్ తమ లక్ష్యసాధనకు అడ్డుగా ఉందని వారు భావిస్తున్నారని.. అందుకే తనపై దాడి చేయించారని ఆరోపించారు.