HYD: భాగ్యనగరంలో మధ్యాహ్నం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉదయం వరకు వాతావరణం పొడిగా ఉన్నా.. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో అధికారులు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ జామ్ దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు.
వార్తలు
నగర వాసులకు వర్షం అలర్ట్


