హైదరాబాద్: 28°C
వార్తలు

హైటెన్షన్ వైర్లు తగిలి దంపతుల మృతి

NTR: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఇటికాయలపల్లెకు చెందిన సింహాచలం, వెంకటరమణ దంపతులు కనకదుర్గ నగర్‌ వద్ద వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. గురువారం వాటరింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. హైటెన్షన్‌ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.