హైదరాబాద్: 28°C
వార్తలు

'వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది'

SKLM: పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన కారు ప్రమాదం ఘటనపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే గోవిందరావు ఆరోపించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు, ప్రమాదం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు వెల్లడించారు.