RR: రాష్ట్ర ప్రభుత్వం ఓటరు నమోదుకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ను గుర్తింపు పత్రంగా ప్రవేశపెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తప్పుబట్టారు. FRCను ఓటరు నమోదుకు ఉపయోగించరాదని ఈసీ స్పష్టం చేసిందన్నారు. ఈ అంశంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానున్నందున అర్హులు క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయాలని సూచించారు.
వార్తలు
FRCపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ


