హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ పేపర్ లీక్‌పై చర్చకు సిద్ధం: కేంద్రం

లోక్‌సభలో నీట్ పేపర్ లీక్‌ వ్యవహారం దుమారం రేపింది. ఈ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని, PM మోదీ సభకు వచ్చి క్షమాపణలు చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. నీట్ పరీక్షపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆందోళనల మధ్య సభ రేపటికి వాయిదా పడింది.