MBNR: అర్హత కలిగిన ఒంటరి మహిళలు, వృద్ధులు పింఛన్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో జయరాం నాయక్ సూచించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులను సంప్రదించి అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
వార్తలు
'అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి'


