హైదరాబాద్: 28°C
వార్తలు

శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు: DMHO

కడప జిల్లాలో మాతృ, శిశు మరణాలపై DMHO డా.యుగంధర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. మరణాలకు దారితీసిన పరిస్థితులను గుర్తించి, గర్భిణులపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆశా, ANMలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 'ఏ తల్లీ, శిశువు జన్మనిస్తూ మరణించకూడదు’ అనే నినాదంతో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.