హైదరాబాద్: 28°C
వార్తలు

యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం

HYD: డా. బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయా కృష్ణారెడ్డి ఇవాళ లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. అక్టోబర్‌లో నిర్వహించనున్న యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవానికి హాజరుకావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు గవర్నర్ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.