హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 14న హైదరాబాద్‌లో బీజేపీ తిరంగా ర్యాలీ

HYD: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌పై తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు BJP పోలీసుల అనుమతి కోరింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంబేద్కర్‌ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రామచందర్ రావు పాల్గొంటారని పేర్కొంది.