హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో హైఅలర్ట్‌.. ఉగ్రవాదుల ఫొటోలు విడుదల

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియన్‌ ముజాహిదీన్‌, అల్‌ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఎర్రకోట వద్ద 15 నుంచి 20 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు 1000 సీసీ కెమెరాలు, యాంటీ డ్రోన్‌ వ్యవస్థలతో ప్రత్యేక నిఘా ఉంచారు.