హైదరాబాద్: 28°C
వార్తలు

మావోయిస్టు కమిటీ సభ్యురాలు లొంగుబాటు

TG: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమతా ములుగులో పోలీసుల ఎదుట లొంగిపోయారు. 1985లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె 2003లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం కింద రూ.20 లక్షల రివార్డు అందించారు. మిగిలిన తెలంగాణకు చెందిన యాక్టివ్‌ కేడర్లు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ సీవీ ఆనంద్‌ పిలుపునిచ్చారు.