NLG: జూద స్థావరంపై దాడి చేసిన పోలీసులు 12 మందిని అరెస్టు చేసిన ఘటన ఆదివారం మిర్యాలగూడ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండల పరిధిలోని తడకమళ్లలో కంసాలి మణెమ్మ పాత ఇంట్లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా.. 12 మంది జూదరులు పట్టుపడ్డారని ఆయన తెలిపారు.
వార్తలు
పేకాటస్ధావరంపై పోలీసుల దాడి


