బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సరిసబ్ గ్రామంలో వేగంగా వచ్చిన SUV వాహనం అదుపుతప్పి ముగ్గురు మహిళల పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. మృతులు రీటా దేవి, కిరణ్ దేవి, ఫూల్దై దేవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి అనంతరం ఘటనపై కేసు నమోదు చేశారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి


