హైదరాబాద్: 28°C
వార్తలు

పంచాయతీల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు

భూపాలపల్లి రెవెన్యూ డివిజన్‌లోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. భూపాలపల్లి, గోరికొత్తపల్లి, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురం మండలాల్లోని 136 పంచాయతీలకు మొత్తం రూ.5.77 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు.