హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ఆదివారం మదనపురం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు కొన్నూరులో రైల్వే లైన్ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తపల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం కురుమూర్తి రాయ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేయనున్నారు.