హైదరాబాద్: 28°C
వార్తలు

'వీధి వ్యాపారులకు పని భద్రత కల్పించాలి'

BPT: అద్దంకి పట్టణంలోని వీధి వ్యాపారులకు పని భద్రత కల్పించి, ప్రభుత్వం ముద్ర రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా నాయకులు సీహెచ్‌ మజుందార్‌ కోరారు. అంబేద్కర్‌ భవన్‌లో సీఐటీయూ అనుబంధ వీధి వ్యాపారుల యూనియన్‌ ఆధ్వర్యంలో జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు.చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్న వారిపై అధికారుల వేధింపులు ఆపాలని కోరారు.