హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలను తలపిస్తున్న వాడపల్లి ఆలయం

కోనసీమ తిరుమలగా పేరు గాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఏడు వారాల మొక్కుల భక్తులు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.