WGL: నల్లబెల్లి మండలం రుద్రగూడెం కాంగ్రెస్ నాయకుడు గాదె కరుణాకర్ అకాల మరణం చెందారు. ఆయన మృతదేహానికి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలయి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
కరుణాకర్కు పాలయి శ్రీనివాస్ నివాళి


