AP: రాష్ట్రంలో విజయవాడ, కాకినాడ, కడప ఆయుశ్ ఆస్పత్రుల ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. 150 ఆయుశ్ డిస్పెన్సరీల అప్గ్రేడేషన్ చేస్తున్నామని.. 126 కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా మార్చామని చెప్పారు. 90 ఆయుశ్ కేంద్రాలను NABH గుర్తించిందన్నారు. ప్రజలకు సహజసిద్ధ నివారణా వైద్యం అందించడమే లక్ష్యంగా ఆయుశ్ పని చేస్తోందని పేర్కొన్నారు.
వార్తలు
APలో ఆయుశ్ ఆస్పత్రుల ఆధునీకరణ: సత్యకుమార్


