హైదరాబాద్: 28°C
వార్తలు

'అనకాపల్లి 150 ఏళ్ల వేడుకలకు సన్నాహాలు'

అనకాపల్లి మున్సిపాలిటీకి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. గురువారం పెరుగు బజార్ జంక్షన్‌లో మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాంజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమాజానికి సేవలందించిన రాంజీ ఆదర్శప్రాయ నాయకుడని కొనియాడుతూ, ఆయన విగ్రహ ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.