హైదరాబాద్: 28°C
వార్తలు

తెహల్కా మాజీ ఎడిటర్‌కు భారీ షాక్

అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు భారీ షాక్ తగిలింది. 2013లో సహచరిపై అత్యాచారం కేసులో ఆయనను దోషిగా తేల్చుతూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. 2013 నవంబర్‌లో గోవాలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఓ హోటల్ లిఫ్ట్‌లో తనపై లైంగిక దాడి జరిగిందంటూ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది.