హైదరాబాద్: 28°C
వార్తలు

ఆందోళన కలిగిస్తున్న నిత్యావసర ధరల పెరుగుదల

వరుస పండుగలు రానున్న వేళ ప్రజలకు ధరల పెరుగుదల ఆందోళనగా మారింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల పర్యవేక్షణ వ్యవస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 5 నెలల్లో 16 ప్రధాన నిత్యావసర ఆహార వస్తువుల్లో 15 వస్తువుల ధరలు పెరిగాయి. అంటే దాదాపు 99 శాతం రేషన్ వస్తువులు గతంతో పోలిస్తే అధిక ధరలకు లభిస్తున్నాయి. దీంతో ప్రతి కుటుంబం నెలవారీ ఆహార వ్యయం గణనీయంగా పెరిగే పరిస్థితి ఏర్పడింది.