హైదరాబాద్: 28°C
వార్తలు

సింగీతం రిజర్వాయర్‌ను పరిశీలించిన ఆర్డీవో

KMR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొహమ్మద్‌నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరింది. దీంతో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి బుధవారం రిజర్వాయర్‌ను సందర్శించి వరద పరిస్థితిని పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులను అడిగి నీటి మట్టం, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.