హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆందోళనల వేళ పోలీసులు, భద్రతా బలగాలు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాళ్లు విసిరిన యువతపై కఠినంగా వ్యవహరించకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని పేర్కొంది. నిరసనలకు కారణాలు వినడమే బలమైన ఆయుధమని, ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తే హింస పెరుగుతుందని హెచ్చరించింది. ఈ మేరకు CJI నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌తో జతచేసింది.