కర్ణాటకలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం సిద్ధరామయ్య హాజరుకాకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కురుబ వర్గం నుంచి ఆయన సిఫార్సు చేసిన ఇద్దరు నేతలకు మంత్రి పదవులు దక్కకపోవడంతోనే ఆయన అలిగారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను ఆయన కుమారుడు యతీంద్ర ఖండించారు. తన తండ్రికి ఎలాంటి ఆగ్రహం లేదని, ఆయన అలిగారనడం అవాస్తవమని స్పష్టం చేశారు.
వార్తలు
సిద్ధరామయ్య అలిగారా?.. కుమారుడి క్లారిటీ


