హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆరోగ్య సమస్యలను సత్వరమే గుర్తించాలి'

PPM: క్షేత్ర స్థాయిలో ఆరోగ్య పరమైన సమస్యలను సత్వరమే గుర్తించి తగు చికిత్స అందించాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. శంబర, మక్కువ, డోకిశీల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు, ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై ఈ సందర్భంగా సమీక్ష జరిపారు.