సత్యసాయి: జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.90 వేల జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మునీర్ అహ్మద్ హెచ్చరించారు.
వార్తలు
డ్రంక్ అండ్ డ్రైవ్లో తొమ్మిది మందికి జరిమానా


