హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్టుబడుల ఆకర్షణకే కొత్త బిల్లు

పెట్టుబడులు పెంచడం, ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం 'ట్యాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లు-2026'ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి 2041 వరకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. విదేశీ ఇన్వెస్టర్లకూ ట్యాక్స్ రాయితీలు ప్రకటించారు.