హైదరాబాద్: 28°C
వార్తలు

కర్ణాటక కొత్త స్పీకర్‌గా జీఎస్‌ పాటిల్‌

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ నూతన స్పీకర్‌గా జీఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా ఏఎస్ పొన్నన్నను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇక శాసనమండలి ఛైర్మన్‌గా సలీం అహ్మద్, డిప్యూటీ చైర్మన్‌‌గా సీనియర్ నేత, నటి ఉమాశ్రీ నియామకానికి ఆమోదం తెలిపింది. త్వరలోనే వారు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.