హైదరాబాద్: 28°C
వార్తలు

'రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం'

NTR: రేపు కలెక్టరేట్‌లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.