హైదరాబాద్: 28°C
వార్తలు

'లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

EG: గోదావరికి వరద పోటెత్తడంతో రాజమండ్రి పరిసర లోతట్టు, నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం సూచించారు. యంత్రాంగం పరిస్థితిని ఎప్పకటికప్పుడు పర్యవేక్షిస్తోందని, నది వద్దకు వెళ్లరాదని తెలిపారు. అవసరం లేని ప్రయాణాలు మానివేయాలని, ప్రజలకు అవసరమైన అన్ని సహాయక చర్యలను సిద్ధంగా ఉంచినట్లు ఆమె పేర్కొన్నారు.