ప్రధాని మోదీపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని పదవి చేపట్టి 12 ఏళ్లు అవుతోందని, అయినప్పటికీ సరైన నియంతగా మారడంలో ఆయన విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఒక నియంతగా ఎలా మారాలో కూడా ప్రధానికి తెలియదన్నారు. ఈ విషయంలో తను పూర్తిగా నిరాశ చెందినట్లు చెప్పారు. తమ తల్లిని దూషించిన వారిని క్షమించటమే మోదీకి తెలుసని పేర్కొన్నారు.
వార్తలు
మోదీపై పూనావాలా సంచలన వ్యాఖ్యలు


