హైదరాబాద్: 28°C
వార్తలు

నెహ్రూ జూపార్క్‌కు వెళ్లే వారికి షాక్.. 

హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్ పార్క్‌ సందర్శకులకు షాక్‌. జూ ఎంట్రీ టికెట్ ధరలను అధికారులు పెంచారు. శనివారం నుంచి పెద్దలకు రూ.120, చిన్నారులకు రూ.60 వసూలు చేయనున్నారు. విదేశీయులకు పెద్దలకు రూ.1000, చిన్నారులకు రూ.500గా నిర్ణయించారు. సఫారీ, చిట్టి రైలు, బ్యాటరీ వాహనాల ఛార్జీలను కూడా పెంచుతూ అధికారులు కొత్త ధరలను ప్రకటించారు.